Akhilesh Yadav: ఎస్పీ కంచుకోట నుంచి అఖిలేశ్ పోటీ..
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్ లోక్సభ సీటు నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ స్పష్టం చేసింది.
లఖ్నవూ: సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) పోటీ చేసే స్థానం ఖరారైంది. ఆ పార్టీ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎస్పీ ‘ఎక్స్’లో వెల్లడించింది.
గురువారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ సమాచారమిచ్చింది. ముందుగా ఈ స్థానం నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్నా.. తాజాగా అఖిలేశ్ పోటీకి దిగుతున్నారు. కన్నౌజ్లో ఎస్పీతో సహా అఖిలేశ్ కుటుంబానికి మంచి పట్టుంది. 2019లో అజంగఢ్ స్థానం నుంచి పోటీ చేసిన అఖిలేశ్ విజయం సాధించారు. కానీ, 2022లో కర్హల్ నుంచి ఎన్నికైనా ఆ తర్వాత అక్కడి నుంచి తప్పుకొన్నారు.
ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
మళ్లీ లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి అఖిలేశ్ రంగంలో దిగుతారంటూ వస్తోన్న ఊహాగాహాల మధ్య ఆ పార్టీ ఆయన పోటీపై క్లారిటీ ఇచ్చింది. 2019 వరకు సమాజ్వాదీ పార్టీకి కన్నౌజ్ కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో భాజపా నేత సుబ్రాత్ పాఠక్ అక్కడి నుంచి విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో గెలుపొందిన అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్.. 2014లోనూ సీటు దక్కించుకున్నారు. 2019లో ఆమె ఓటమిపాలయ్యారు. అనంతరం ములాయం సింగ్ యాదవ్ మరణంతో 2022లో మెయిన్పురికి జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ విజయం సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంగారులో కంగనా.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ కాస్త గందరగోళానికి గురయ్యారు. తేజస్వీ యాదవ్పై విమర్శలు గుప్పించే ప్రయత్నంలో తమ పార్టీ నేత తేజస్వీ సూర్యపై ఆరోపణలు చేశారు. -
దిల్లీ ప్రజలు భాజపాకు ఓటుతో సమాధానం చెప్తారు: ఆప్
తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ దిల్లీలో వాకథాన్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
గాంధీ కుటుంబానికి నేనేం సేవకుడిని కాదు: అమేఠీ కాంగ్రెస్ అభ్యర్థి
తనను గాంధీ కుటుంబానికి ప్యూన్గా అభివర్ణించిన భాజపాపై కాంగ్రెస్ అమేఠీ అభ్యర్థి కేఎల్ శర్మ స్పందించారు. -
నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్-3 ఎవరంటే?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, కేసులు, ఇతర వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. -
పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్నాథ్
Rajnath Singh: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు. -
ఆ రాష్ట్రంలో లోక్సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు
పంజాబ్లో 12 మంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఆప్ నుంచి 9 మంది ఉన్నారు. -
డబ్బుల్లేవ్... పోటీ చేయలేను
ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్ను తిరస్కరించారు. -
రాయ్బరేలీలో రాహుల్ ఓటమి ఖాయం: అమిత్ షా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు స్థానాల నుంచి బరిలో దిగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. -
‘ఇండియా’ గెలుపు పక్కా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ధీమా వ్యక్తం చేశారు. -
మైనార్టీల అడ్డాలు!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోధ్రా రైలు దహనకాండలో.. బాధ్యులను కాపాడజూసిన లాలూ
అరవైమందికి పైగా కరసేవకులను సజీవదహనం చేసిన 2002 నాటి గోధ్రా రైలు దహనకాండలో బాధ్యులైనవారిని కాపాడేందుకు సైతం ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలనే ఎంచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. -
మేం మంగళసూత్రాలు లాక్కొనేంత దుష్టులమా?
ధికారంలో ఉండడం కోసం హిందువుల్లో భయం సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. -
ప్రజలతో సంబంధాలు తెగిపోయిన చక్రవర్తి మోదీ
కాంగ్రెస్ అగ్ర నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ‘యువరాజు’గా పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా దీటుగా బదులిచ్చారు. -
10 వేలమంది అనుచరులతో సభ
ఉత్తర్ప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీచేస్తున్న కరణ్ భూషణ్ శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. -
మోతీలాల్ నెహ్రూపై కంగన అనుచిత వ్యాఖ్యలు
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూను అంబానీతో పోలుస్తూ బాలీవుడ్ నటి, భాజపా లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. -
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా కుట్రే!
సందేశ్ఖాలీ ఘటనలు.. లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి భాజపా పన్నిన కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. -
సంక్షిప్త వార్తలు (5)
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 40 మందితో ప్రచార తారల జాబితాను శనివారం ప్రకటించింది. -
దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్
మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమై... ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్న భరోసా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తోంది. -
ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!
ఉత్తరాదిన ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు గత కొంతకాలంగా అవకాశం ఇవ్వడం లేదు. -
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారు: అమిత్ షా
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. -
ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్, సునీత, సిసోదియా
ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కేజ్రీవాల్, సునీత, సిసోదియా వంటి వారి పేర్లు ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!