Smriti Irani: అయోధ్య పర్యటనతో కాంగ్రెస్ కొత్త నాటకం.. రాహుల్పై స్మృతి ఇరానీ ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల వేళ అయోధ్య పర్యటన పేరుతో కొత్త నాటకానికి తెర లేపుతున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
దిల్లీ: ఉత్తరప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో హస్తం పార్టీపై భాజపా నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘ఇప్పటివరకు అమేఠీలో సమస్యపై దృష్టి పెట్టాం. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కోసం ఎదురు చూస్తున్నాం. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికై కేంద్రం పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. కానీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అయోధ్య పర్యటనకు సిద్ధమవుతున్నారు. పర్యటన పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెర లేపుతోంది. రాముడి పేరును వినియోగించుకుని ఓట్లు అడిగేందుకే ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే రాహుల్ ఈ పర్యటనకు సిద్ధమయ్యారు’’ అని విమర్శలు గుప్పించారు.
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన రాయ్బరేలీ, అమేఠీ సహా పలు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను నేడు ఖరారు చేసే అవకాశాలున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో భేటీ కానుంది. ఐదో విడతలో భాగంగా అమేఠీలో మే 20న పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గానికి గత 15 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. 2019 ఎన్నికల్లో స్మృతి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీలో ఆఖరి దశ ఆసక్తికరం.. భాజపా, మిత్రపక్షాలకు కీలకం..
యూపీలో మూడు దశల్లో 26 నియోజకవర్టాల్లో పోలింగ్ ముగిసింది. మరో 54 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. -
అమ్మ స్వర్గం నుంచే తమ్ముణ్ని ఆశీర్వదించి ఉంటుంది
‘‘అమ్మ ఈ లోకంలో లేకపోయినా, తప్పకుండా స్వర్గం నుంచే నరేంద్ర భాయీని ఆశీర్వదించి ఉంటుంది’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సోమాభాయీ మోదీ అన్నారు. -
పాకిస్థాన్ను సంతోషపరిచే వ్యక్తిని గెలిపించాలా.. లేదా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారు
పాకిస్థాన్ను సంతోషపరిచే నాయకుడిని ఎన్నుకోవాలా? లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను గెలిపించాలా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారని భాజపా మంగళవారం పేర్కొంది. -
మూడో దశలో 64.58% పోలింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల తృతీయ విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే.. అంతటా ఈ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది. -
అబద్ధాలాడే వారిని తిరస్కరించండి: సోనియా
అబద్ధాలు చెప్పేవారిని, విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిని ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. అందరికీ సమానమైన, మెరుగైన అవకాశాలు లభించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. -
ముస్లిం రిజర్వేషన్లకు నేను అనుకూలం : లాలూ
ముస్లింలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించేందుకు తాను అనుకూలమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ వ్యాఖ్యానించారు. -
ఏడోదశ ఎన్నికలకు నోటిఫికేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో చిట్టచివరిదైన ఏడో దశలో 57 లోక్సభ స్థానాల్లో జూన్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. -
జీఎస్టీని సవరిస్తాం.. అగ్నివీర్ను రద్దుచేస్తాం
సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను సవరించి ఒకే శ్లాబుగా చేయడంతో పాటు, సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ పథకాన్ని రద్దుచేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’
అయోధ్యలోని రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’ వేయకుండా, కశ్మీర్లో ఆర్టికల్ 370 మళ్లీ తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకే ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
ముస్లింలకు వ్యతిరేకం కాను : మోదీ
ఇస్లాంను, ముస్లింలను తాను వ్యతిరేకించనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని ఈ విధంగా స్పందించారు. -
మేనల్లుడిపై మాయావతి వేటు
తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్పై పార్టీ అధ్యక్షురాలు మాయావతి వేటు వేశారు. -
భాజపాలోకి రాధికా ఖేడా
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడాతో పాటు నటుడు శేఖర్ సుమన్ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ మీడియా విభాగం ఇన్ఛార్జి అనిల్ బలూనీ సమక్షంలో వారు మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. -
ముగిసిన మూడోదశ.. 60 శాతం పోలింగ్ నమోదు
మూడో దశ ఎన్నికల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. -
మోదీ ప్రభుత్వంలో ఆ హక్కులన్నీ పారిశ్రామికవేత్తలకే : రాహుల్గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అధికార భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. -
ఆ తెగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సత్ఫలితాలిస్తోన్న ఈసీ చర్యలు
మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ బూత్లు ఏర్పాటుచేయడం.. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం కోసం ఈసీ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. -
పశువుల మేత మేసిన నేత.. రిజర్వేషన్లపై మాటలా?: లాలూపై మోదీ ఫైర్
PM Modi: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. లాలూ దాణా కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ గట్టిగా చురకలంటించారు. -
ఆ వీడియోను తొలగించండి : ‘ఎక్స్కు’ ఈసీ ఆదేశం
ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్ణాటక భాజపా షేర్ చేసిన ఓ వీడియోను తొలగించాలని ‘ఎక్స్’ను ఈసీ ఆదేశించింది. -
పరిస్థితులు ఏవైనా అధికారమే భాజపా లక్ష్యం : వీడియో సందేశంలో సోనియా విమర్శలు
ఎలాంటి పరిస్థితుల్లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భాజపా ముందుకువెళ్తోందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) విమర్శించారు. -
భాజపాలోకి నటుడు శేఖర్ సుమన్
ఇటీవల కాంగ్రెస్ను వీడిన నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్ మాజీ నేత రాధికా ఖేడా ఇద్దరూ భాజపాలో చేరారు. -
మొన్న పూరీ.. నేడు చండీగఢ్.. నిధులు లేవని టికెట్లను వెనక్కి ఇచ్చేస్తున్న నేతలు
చివరి నిమిషంలో అభ్యర్థులు వీడుతుండటం ఆయా పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
తాజా వార్తలు
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM