ఆరు బంతులకు ఆరూ సిక్సర్లే..: భాజపా అభ్యర్థి వ్యాఖ్యలపై అఖిలేశ్ రియాక్షన్
కన్నౌజ్లో అఖిలేశ్ యాదవ్ పోటీ చేయడంతో ఇక్కడి పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్లా ఉంటుందంటూ భాజపా అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ స్పందించారు.
కన్నౌజ్: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నుంచి నామినేషన్ వేశారు. రామ్గోపాల్ యాదవ్తో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలతో కలిసి వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నౌజ్ లోక్సభ సీటు నుంచి అఖిలేశ్ పోటీలో ఉండటంతో ఇక్కడ ఎన్నికలను భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్తో పోల్చుతూ భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ‘వారు (భాజపా) బంతిని విసరలేరు.. బ్యాట్ను సైతం ఉపయోగించలేరు. మేం ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడతాం’ అన్నారు.
భాజపా నెగెటివ్ రాజకీయాలకు తెరపడుతుంది!
‘‘కన్నౌజ్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు నేను ఇక్కడినుంచి పోటీ చేయాలని కోరుకొంటున్నారు. ప్రజల ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తున్నా. కన్నౌజ్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. ఇక్కడినుంచి పోటీ చేయాలని నాన్న (ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్) నన్ను కోరిన తర్వాత నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు.. జనేశ్వర్ మిశ్రా, అమర్ సింగ్, ఆజం ఖాన్, నేతాజీ సహా అగ్రనేతలు ఇక్కడే ఉన్నారు. ఈ ఎన్నికలు భాజపా ప్రతికూల రాజకీయాలకు తెరదించుతాయి. భాజపా ప్రతికూల రాజకీయాలు గానీ, పనితీరు గానీ ప్రజలకు నచ్చదు. ఇక్కడ నేను గెలిచిన తర్వాత కన్నౌజ్ నుంచి సోదరభావం, ప్రేమ వ్యాప్తి చెందుతాయి’’ అన్నారు.
మోదీ, రాహుల్ వ్యాఖ్యలు.. కోడ్ ఉల్లంఘనపై ఈసీ నోటీసులు
సరైన సమయంలోనే ఇక్కడ ఉన్నా..
ఇక్కడ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై నెలకొన్న జాప్యంపైనా అఖిలేశ్ స్పందించారు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలన్న పాత సామెతను గుర్తు చేశారు. తాను సరైన సమయంలోనే ఇక్కడ ఉన్నానన్నారు. కన్నౌజ్లో సమాజ్వాదీ పార్టీ ప్రారంభించిన పనుల్ని భాజపా ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. ఈసందర్భంగా రామ్గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. కన్నౌజ్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. భాజపా అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకపోవచ్చన్నారు. ఇదిలాఉండగా.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ అన్నయ్య మనవడు తేజ్ప్రతాప్ యాదవ్ ఇక్కడినుంచి పోటీ చేస్తారని సమాజ్వాదీ పార్టీ తొలుత ప్రకటించినప్పటికీ బుధవారం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.
1998 నుంచి 2014 వరకు సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ భాజపా నుంచి సుబ్రత్ పాఠక్ విజయం సాధించారు. 2000, 2004, 2009 ఎన్నికల్లో అఖిలేశ్ ఇక్కడినుంచి హ్యాట్రిక్ విజయం సాధించగా.. 2012, 2014లో జరిగిన ఈ స్థానంలో జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి డింపుల్ యాదవ్ విజయం సాధించారు. 2019లో మాత్రం భాజపా అభ్యర్థి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న నాలుగోవిడతలో కన్నౌజ్లో ఎన్నికలు జరగనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!