ఈ పుట్టగొడుగులు కిలో ₹30వేలట!
పోషకాలు మెండుగా ఉండే ఆహార పదార్థాల్లో పుట్టగొడుగు ఒకటి. శరీరానికి అవసరమయ్యే పోటాషియం, బి విటమిన్లు, ముఖ్యంగా డీ విటమిన్లు ఇందులో అధికంగా ఉంటాయి. అందుకే వీటిని నిత్యం తినకున్నా చాలా మంది అప్పడప్పుడు వండుకొని తింటుంటారు. అయితే సాధారణంగా
(ఫొటో: అమెజాన్.ఇన్)
ఇంటర్నెట్ డెస్క్: పోషకాలు మెండుగా ఉండే ఆహార పదార్థాల్లో పుట్టగొడుగు ఒకటి. శరీరానికి అవసరమయ్యే పొటాషియం, బి విటమిన్లు, ముఖ్యంగా డి విటమిన్ ఇందులో అధికంగా ఉంటాయి. అందుకే వీటిని నిత్యం తినకున్నా చాలా మంది అప్పుడప్పుడు వండుకొని తింటుంటారు. అయితే మామూలుగా వీటి ధర కిలో వందల్లో ఉంటుంది. కానీ, ఓ రకం పుట్టగొడుగుల ధర కిలో రూ.30వేలు పలుకుతోంది. అవాక్కయ్యరా!! నిజమేనండీ.. ఈ అరుదైన పుట్టగొడుగులు ఇంత ఖరీదైనా.. డిమాండ్ కూడా అంతే భారీగా ఉండటం విశేషం. మరి ఈ పుట్టగొడుగులకు ఎందుకింత ధర? అంత ప్రత్యేకత ఏముంది??
శాస్త్రీయంగా మొర్కెల్లా ఎస్కులెంటా అని పిలిచే ఈ పుట్టగొడుగులను వాడుక భాషలో ‘గుచ్చి’ పుట్టగొడుగులు అని పిలుస్తారు. సాధారణ పుట్టగొడుగుల్లో చాలా వరకు విషపూరితంగా ఉంటాయి. అందుకే ప్రత్యేకంగా పుట్టగొడుగులను పండించి మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ ఈ ‘గుచ్చి’ పుట్టగొడుగులు అటవీ ప్రాంతాల్లో సహజంగా పెరుగుతాయి. తేనె పట్టు ఆకృతిలో ఉండే ఈ పుట్టగొడుగులు హిమాలయాల పర్వత సానువులు, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు అటవీ ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. శీతాకాలం ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లోని స్థానికులు వీటిని సేకరించే పని మొదలుపెడతారు.
అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పెరుగుతాయో స్పష్టంగా తెలియదు. ఒక సీజన్లో ఒక చోట పెరిగిన పుట్టగొడుగులు.. మళ్లీ అదే చోట పెరగవు. ఇంత అరుదైన ఈ గుచ్చి పుట్టగొడుగులను సేకరించడం కోసం స్థానిక ప్రజలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతంలో ప్రతి అంగుళం అన్వేషించి వాటిని కనిపెట్టి సేకరించాలి. కొన్ని సార్లు ఎంత కష్టపడినా కనీసం కిలో పుట్టగొడుగులు కూడా లభించవు. అలా కష్టపడి సేకరించిన పుట్ట గొడుగులను విరగకుండా.. చాలా జాగ్రత్తగా వేడి నీళ్లలో కడిగి ఆరబెడతారు. అవి ఎండిన తర్వాత మార్కెట్లోకి పంపుతారు. సహజంగా పెరగడం, అధిక పోషకాలు, ప్రత్యేకమైన రుచి కలిగి ఉండటం, వీటిని సేకరించే ప్రక్రియలో కష్టం అన్ని కలిసి వీటి ధరను అంతలా పెంచాయి. అయితే, వీటి నాణ్యతను బట్టి కిలో ధర రూ.10వేల నుంచి 30వేల వరకు ఉంటుంది. పుట్టగొడుగులు విరగకుండా, తాజాగా ఉంటే మాత్రం రూ. 30వేలకు కిలో చొప్పున అమ్ముతుంటారు. ఈ పుట్ట గొడుగులను ముఖ్యంగా పలావ్లా చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ధర ఎక్కువున్నా పర్లేదు ప్రయత్నించి చూస్తామంటే.. ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లలో ఈ పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!