అందం కోసం పాకులాడితే.. చివరికి!
ప్రస్తుత అత్యాధునిక వైద్యశాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వ సాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని,
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత అత్యాధునిక వైద్యశాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వ సాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని, ముక్కు, పెదాలు సరిగా లేవంటూ శస్త్రచికిత్సలు చేయించుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల అనర్థాలూ జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఎంతో అందంగా తయారవుతుందనుకున్నా ఆమె ముఖం.. ఇప్పుడు సగం పక్షవాతానికి గురైంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
మనదేశంలో కొందరు సినీ సెలబ్రిటీలు ముఖంలో కొన్ని భాగాలకు శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయం తెలిసిందే. చైనా, దక్షిణకొరియా వంటి దేశాల్లో మాత్రం సామాన్యులు సైతం ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంటుంటారు. ఆయా దేశాల్లో సాధారణ ఆస్పత్రులకంటే ఇలా మనిషి ముఖాన్ని అందంగా కనిపించేందుకు శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులే ఎక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చైనాలోని హాంగ్జు నగరానికి చెందిన జావో అనే యువతి తన ముఖంపై ముడతలు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
అప్పటికే పలుమార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్న ఆ యువతి గత నెల 12న కూడా శస్త్రచికిత్స చేయించుకుంది. వైద్యులు ముఖంపై ఉన్న ముడతలకు సూది మందులిచ్చారు. అయితే ఈ సారి ఆమెకు జరిగిన శస్త్రచికిత్స విఫలమైంది. సెప్టెంబర్ 19న ఆమె ముఖంలో సగభాగం పక్షవాతానికి గురైంది. నోరు వంకరపోయింది. ఎడమవైపు కనుబొమ్మలు పైకి లేచి అలాగే ఉండిపోయాయి. ఎడమ కన్నును పూర్తిగా మూయలేకపోతోంది. వంకరపోయిన నోరుతో సరిగా భోజనం కూడా చేయలేకపోతోంది.
వేరే ఆస్పత్రుల్లో వైద్య నిపుణులతో పరీక్షలు చేయించగా.. జావోకి ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ వచ్చినట్లు వెల్లడైంది. చికిత్స చేసినా ముఖం ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో వైద్యులు చెప్పలేకపోతున్నారు. జావో ముఖం శాశ్వతంగా పక్షవాతంతోనే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తన ముఖం ఇలా మారడానికి కారణమైన ఆస్పత్రిపై జావో కేసు వేసింది. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావో ఈ వివరాలు వెల్లడించింది. ఉదయాన్నే తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే ఎంతో బాధ కలుగుతుందని, జీవితంపై విరక్తి పుడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం