అదనపు రుణానికి ఏపీకి కేంద్రం అనుమతి

అదనపు రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతించింది. కొవిడ్‌ సంక్షోభం కారణంగా ఆదాయం తగ్గిన నేపథ్యంలో

Updated : 02 Oct 2020 16:32 IST

అమరావతి: అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు అనుమతించింది. కొవిడ్‌ సంక్షోభం కారణంగా ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.4,851కోట్లు, ఏపీ 2,525 కోట్ల అదనపు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ సమ్మతించింది. సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం-ఒకే రేషన్‌ అమల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ ఆరోస్థానంలో నిలవడంతో ఆ రాష్ట్రం అదనపు రుణం పొందేందుకు కేంద్రం అనుమతించింది. మరోవైపు సులభతర వాణిజ్యంలో ఏపీ తొలిస్థానంలో నిలవడం.. ఒకే దేశం-ఒకే రేషన్‌ అమల్లోనూ విజయవంతం కావడంతో అదనపు రుణానికి ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని