ఏపీ సీఎస్‌తో కేంద్రబృందం భేటీ

ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది.

Published : 09 Nov 2020 15:43 IST

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. తొలుత సచివాలయంలో సీఎస్‌ నీలం సాహ్నితో కేంద్రబృందం సమావేశమైంది. ఈ సందర్భంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను బృందం పరిశీలించింది. అనంతరం పంటనష్టంపై రాష్ట్ర ఉన్నతాధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,386కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ.840కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 

వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ రంగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. వర్షాలకు భారీగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఆర్‌అండ్‌బీ శాఖు రూ.2,976 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించింది. ఇప్పటికే ఈ విషయంపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం జగన్‌ లేఖ రాసిన విషయాన్ని ఉన్నతాధికారులు కేంద్రబృందానికి తెలిపారు. సమావేశం అనంతరం కేంద్ర అధికారులు బృందాలుగా విడిపోయి జిల్లాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని