పింఛన్‌దారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త!

పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పణ తేదీని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడగించింది. నవంబర్‌ 30 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన 35 లక్షలకు పైగా...

Published : 28 Nov 2020 19:08 IST

జీవన ప్రమాణ పత్రం దాఖలు గడువు పెంపు

ముంబయి: పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పణ తేదీని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడగించింది. నవంబర్‌ 30 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా వైరస్‌ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన 35 లక్షల మందికి పైగా పింఛన్‌దారులకు లబ్ది చేకూరనుంది. వీరందరికీ ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఫించను మంజూరు చేయనున్నారు.

‘కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల పెద్ద వయస్కులు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే ఈపీఎఫ్‌వో పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం సమర్పణ తేదీని నవంబర్‌ 28 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నాం’ అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యతో 35 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. 

ప్రస్తుతం జీవన ప్రమాణ పత్రాన్ని నవంబర్‌ 30లోపు ఎప్పుడైనా సమర్పించొచ్చు. దరఖాస్తు చేసిన తేదీ నుంచి ఏడాది వరకు ఇది వర్తిస్తుంది. తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడగించారు. సాధారణ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, ఫించన్లు ఇచ్చే బ్యాంకు శాఖల్లో జీవన ప్రమాణ పత్రాలను సమర్పించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని