‘పెళ్లికి గిఫ్టులొద్దు.. రైతులకు దానం చేయండి’
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తిండీతిప్పలు లేకుండా వారు కొనసాగిస్తున్న ఆందోళనలకు...
చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తిండీతిప్పలు లేకుండా వారు కొనసాగిస్తున్న ఆందోళనలకు అనేకమంది అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్లోని ఓ కుటుంబం తమ దాతృత్వాన్ని చాటుకుంది. తమ కుమారుడి వివాహానికి హాజరయ్యేవారు ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని బంధువులు, మిత్రులకు తెలియజేశారు. బహుమతులకు బదులుగా రైతులకు చేయూతనందించాలని కోరారు. అందుకు వివాహ వేడుకలో ఓ హుండీని ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైనవారు తమకు తోచినంత ఆ హుండీలో వేస్తే పోగైన డబ్బును నిరసనలో పాల్గొంటున్న రైతులకు అందజేయనున్నట్లు ఆ కుటుంబం వెల్లడించింది. ‘ఇది మనందరి పోరాటం. ప్రతిఒక్కరు రైతులకు చేయూతనందించాలి. రైతులకు అండగా నిలవాలని యువతను కోరుతున్నా’ అని వరుడు అభిజిత్సింగ్ పేర్కొన్నాడు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు నేటితో 16వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వానికి, రైతుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా సఫలం కాలేదు. చట్టాలు రద్దు చేయలేమని, కావాలంటే కొన్ని సవరణలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. సవరణలతో మా సమస్యలు తీరవని, నూతన చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చట్టాలను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని రైతు సంఘాలు గతంలోనే నిర్ణయించాయి.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం