హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ బంద్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నిబంధనలను కలకత్తా పోలీసులు మరింత కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనంపై ఉన్నవారు హెల్మెట్‌ ధరించకుండా పెట్రోల్‌ బంక్‌కు వెళితే వారికి పెట్రోల్‌ పోయకూడదు...

Updated : 05 Dec 2020 15:36 IST

నిబంధనలను కఠినతరం చేసిన కోల్‌కతా పోలీసులు

కోల్‌కతా: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నిబంధనలను కలకత్తా పోలీసులు మరింత కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనంపై ఉన్నవారు హెల్మెట్‌ ధరించకుండా పెట్రోల్‌ బంక్‌కు వెళితే వారికి పెట్రోల్‌ పోయకూడదు అనే నిబంధనను తీసుకొచ్చారు.డిసెంబర్‌ 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ‘హెల్మెట్‌ లేకుండా పెట్రోల్‌ బంకుల్లోకి వచ్చే వాహనదారులకు పెట్రోల్‌ పోయకూడదు. కోల్‌కతా నగర పరిధిలోకి వచ్చే అన్ని పెట్రోల్‌ బంకులకు ఈ నిబంధన వర్తిస్తుంది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులుంటే వారిద్దరికీ హెల్మెట్‌ ఉంటేనే ఇంధనం పోయాలి’ అని పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసింది.

హెల్మెట్లు కచ్చితంగా ధరించాల్సిందేనని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రక్షణ కవచం ధరించే బైక్‌ నడపాలన్నారు. ‘అన్ని ప్రభుత్వాల మాదిరి హెల్మెట్‌ లేకుంటే రూ.2 వేల ఫైన్‌ వేస్తామని చెప్పను. ఫైన్‌కు బదులు అందరూ హెల్మెట్‌ ధరించాలని వేడుకుంటాను’ అని పేర్కొన్నారు. హెల్మెట్ కొనుక్కోలేని పరిస్థితి ఉన్నవారు స్థానిక పోలీసుస్టేషన్‌లో నమోదు చేసుకుంటే ప్రభుత్వమే వారికి ఉచితంగా రక్షణ కవచాన్ని అందిస్తుందని వెల్లడించారు. 

ఇవీ చదవండి

శిరస్త్రణం కొంటున్నారా.. ఇవి చూడాల్సిందే..!
 

రెండేళ్ల గరిష్ఠానికి పెట్రోల్‌ ధర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని