22 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయండి

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై

Updated : 14 Sep 2020 13:25 IST

కేంద్రాన్ని కోరిన తెరాస ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి 

దిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు ప్రధాని మోదీకి లేఖలు రాశారని గుర్తు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. ‘‘నవోదయ పాఠశాలల ఏర్పాటు విషయంపై గత ఆరు సంవత్సరాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పాఠశాలల ఏర్పాటుతో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధిస్తుంది. రాష్ట్రంలో 22 జిల్లాల్లో పాఠశాలలు మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన సదుపాయాలు, భూ కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని