AP News: తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి.. వృద్ధురాలి నిరసన

రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా భూ సమస్యను పరిష్కరించడం లేదంటూ నల్లచెరువు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి.....

Published : 28 Sep 2021 23:25 IST

అనంతపురం: రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా భూ సమస్యను పరిష్కరించడం లేదంటూ నల్లచెరువు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఓ వృద్ధురాలు నిరసన తెలిపింది. నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణమ్మకు భర్త ద్వారా మూడెకరాల పొలం సంక్రమించింది. ఆ భూమిని దాయాదులు తమ పేరిట రికార్డుల్లో ఎక్కించుకున్నారని వృద్ధురాలు ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని