CM Jagan: ఏపీకి 13 వైద్యకళాశాలలు మంజూరు చేయండి: జగన్‌

హస్తిన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో భేటీ అయ్యారు.

Published : 30 Apr 2022 19:19 IST

దిల్లీ: హస్తిన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇవాళ ఉదయం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని