CM Jagan: రాష్ట్రంలో గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి: సీఎం జగన్
రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాణిజ్య పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఆదాయాలను ఇచ్చే శాఖలపై సీఎం జగన్ ఇవాళ సమీక్షించారు. తొలుత వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం ఆ శాఖ ప్రగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సూచించారు. అవగాహన పెంచుతూనే వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్లవుతుందని చెప్పారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు.
మద్యం అమ్మకాలు తగ్గాయి..
ఎక్సైజ్ శాఖపై సమీక్షించిన సీఎం జగన్.. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్లు రద్దు చేయడం వంటి వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. మద్య అక్రమ రవాణాను నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేస్తూనే... అక్కడ కూడా ఉపాధి మార్గాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసి, లేకపోతే అర్హులైన వారికి పట్టాలివ్వాలని ఆదేశించారు. పట్టాలు వచ్చిన రైతులకు తద్వారా రైతు భరోసా కూడా లభిస్తుందన్నారు. అప్పుడే ఆశించిన స్థాయిలో మార్పు వస్తుందన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖపైనా సమీక్షించిన సీఎం.. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాలు, వార్డుల్లో సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్గ్రేడ్ చేయాలని ఆదేశించారు. మైనింగ్ శాఖపై సమీక్షిస్తూ.. నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం