Corona: ఏపీలో భారీగా కొత్త కేసులు
ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నా వాయువేగంతో ....
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నా వాయువేగంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23,160మందికి పాజిటివ్గా తేలింది. అలాగే, కొత్తగా 106 మంది మృతిచెందగా.. మరో 24,819మంది కోలుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,82,41,637శాంపిల్స్ పరీక్షించగా.. 14,98,532మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో 12,79,110మందికోలుకొని డిశ్చార్జి కాగా.. 9686మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,736 క్రియాశీల కేసులు ఉన్నాయి.
పశ్చిమగోదావరిలో అధిక మరణాలు
రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 17మంది కొవిడ్తో మృతిచెందగా.. విశాఖ, నెల్లూరులో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున; అనంతపురం, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మృత్యువాతపడ్డారు. గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి (జిల్లాల వారీగా) ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం