AP Constable posts: ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా.. కారణమిదే..
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్(AP police constable Physical Events) వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను తర్వాత వెల్లడించనున్నట్టు పోలీస్ నియామక మండలి తెలిపింది.
అమరావతి: ఏపీలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల(AP Constable posts) భర్తీ కోసం ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్(పీఎంటీ/పీఈటీ) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఈవెంట్స్ను వాయిదా వేస్తున్నట్టు పోలీస్ నియామక మండలి ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. తాజా అప్డేట్స్ కోసం తమ వెబ్సైట్ను చెక్ చేసుకోవాలని రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ మనీశ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి ఫేజ్-2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్కు హాజరయ్యేందుకు ఇటీవలే హాల్ టిక్కెట్లను వెబ్సైట్లో ఉంచిన విషయం తెలిసిందే.
ఒక్కో పోస్టుకు 16 మంది పోటీ..
జనవరి 22న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) జరగ్గా 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారంతా స్టేజ్-2 పరీక్షల కోసం ఫిబ్రవరి 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు కాగా, 17,332 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను 4లక్షల మందికి పైగా అభ్యర్థులు రాసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక