Mansas Trust: మాన్సాస్‌లో ఆడిట్‌ ప్రారంభం

మాన్సాస్‌ (మహారాజా అలక్‌నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌) ట్రస్టు కార్యకలాపాలపై

Updated : 05 Jul 2021 12:44 IST

విజయనగరం: మాన్సాస్‌ (మహారాజా అలక్‌నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌) ట్రస్టు కార్యకలాపాలపై ఆడిటింగ్‌ మొదలైంది. విజయనగరంలోని ట్రస్టు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఆడిట్‌ అధికారి హిమబిందు నేతృత్వంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. మాన్సాస్‌ ట్రస్టులో 16 ఏళ్ల తర్వాత ఆడిట్‌ జరుగుతుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

విచారణాధికారిని నియమించిన ప్రభుత్వం

సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు భూముల వ్యవహారంలో విచారణాధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విశాఖ జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ విచారణాధికారిగా వ్యవహరించనున్నారు. ఈనెల 15లోపు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశించారు. విచారణాధికారికి సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు ఈవోలు సహకరించాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని