బంకులో బైక్‌కు మంటలు

చిక్కడపల్లిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో భారీ ప్రమాదం తప్పింది. స్కూటీలో పెట్రోల్‌ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన ద్విచక్రవాహనదారుడు అక్కడి నుంచి పరుగులుపెట్టాడు....

Published : 02 Apr 2021 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిక్కడపల్లిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో భారీ ప్రమాదం తప్పింది. స్కూటీలో పెట్రోల్‌ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన ద్విచక్రవాహనదారుడు అక్కడి నుంచి పరుగులుపెట్టాడు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. అగ్నిమాపక సిలిండర్‌తో స్ప్రే చేసినా మంటలు అదుపులోకి రాలేదు. చాకచక్యంగా స్పందించిన పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అత్యవసరం కోసం నిల్వచేసిన ఇసుక బకెట్లను తెచ్చి బండిపై పోసి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలను అన్వేషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని