Sajjanar: ఒక్క ట్వీట్‌తో గ్రామానికి బస్సు సౌకర్యం..!

తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఓ యువకుడు చేసిన ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు.

Published : 02 Dec 2021 18:58 IST

కరీంనగర్: తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఓ యువకుడు చేసిన ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన సుదగోని శ్రీనివాస్  అనే యువకుడు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ట్విటర్‌లో కోరాడు.  15 ఏళ్లుగా తమ ఊరికి బస్సు సౌకర్యం లేదని అందులో తెలిపాడు. ఆ ట్వీట్‌పై స్పందించిన సజ్జనార్‌.. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు గ్రామాలకు బస్సు సౌకర్యంతో గ్రామస్థులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని