
Published : 02 Dec 2021 18:58 IST
Sajjanar: ఒక్క ట్వీట్తో గ్రామానికి బస్సు సౌకర్యం..!
కరీంనగర్: తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఓ యువకుడు చేసిన ట్వీట్పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన సుదగోని శ్రీనివాస్ అనే యువకుడు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ట్విటర్లో కోరాడు. 15 ఏళ్లుగా తమ ఊరికి బస్సు సౌకర్యం లేదని అందులో తెలిపాడు. ఆ ట్వీట్పై స్పందించిన సజ్జనార్.. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు గ్రామాలకు బస్సు సౌకర్యంతో గ్రామస్థులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
► Read latest General News and Telugu News
ఇవీ చదవండి
Tags :