CM Jagan: పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి: సీఎం జగన్‌

లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో 

Updated : 04 Jul 2022 12:36 IST

భీమవరం: లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. 

‘‘భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు. పోరాటయోధుల్లో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషకరం. తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి. ఆయన ఘనతను గుర్తుంచుకునే ఆయన పేరుపై జిల్లా ఏర్పాటు చేశాం. అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది’’ అని జగన్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని