పాలమూరు ఎత్తిపోతలపై రెండో రోజు సమీక్ష
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ రెండోరోజూ సమీక్షించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల విస్తరణకు...
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ రెండోరోజూ సమీక్షించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు ఇవ్వాలని సూచించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించాలన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల భూములకు సాగునీరు ఇవ్వాలన్నారు. కాల్వలు, వాగుల ద్వారా నీటిని తీసుకెళ్లేందుకు చెక్ డ్యాములు పటిష్ఠం చేయాలని, పాలమూరుపై పూర్తిగా దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం సర్వే పనులు త్వరగా పూర్తిచేయాలని, పనుల అంచనాలను పరిపాలనా అనుమతుల కోసం పంపాలన్నారు. బల్మూరు, లింగాల, అమ్రాబాద్ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగునీరందించాలన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కి.మీ కాల్వ తీసి, లింగాల వద్ద లిఫ్ట్ నిర్మించాలని సీఎం ఆదేశించారు. మైలారం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్, మున్ననూరులో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు