Cooking Vessles: ఏ పాత్రలో వండితే ఏం లాభమో తెలుసుకోండి!
పూర్వకాలంలో మట్టి పాత్రల్లో వంట చేసేవారు. పెరట్లో పండించిన కూరగాయలు తీసుకొచ్చి మట్టి పొయ్యి మీద వండుకుని తినేవారు. ప్రస్తుతం అన్నీ కృత్రిమంగానే తింటున్నామని చెప్పవచ్చు. మారుతున్న కాలంతో పాటు మన ఆహార అలవాట్లూ మారిపోయాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ ఆటోమాటిక్గా పని చేసేవాటినే వాడుతున్నాం.
ఇంటర్నెట్ డెస్క్: పూర్వకాలంలో మట్టి పాత్రల్లో వంట చేసేవారు. పెరట్లో పండించిన కూరగాయలు తీసుకొచ్చి మట్టి పొయ్యి మీద వండుకుని తినేవారు. ప్రస్తుతం అన్నీ కృత్రిమంగానే తింటున్నామని చెప్పొచ్చు. మారుతున్న కాలంతో పాటు మన ఆహార అలవాట్లూ మారిపోయాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ ఆటోమాటిక్గా పని చేసేవాటినే వాడుతున్నాం. కానీ వంట ఎలా చేసుకోవాలి? ఎలాంటి పాత్రల్లో వంట చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ పాత్ర ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుందామా!
ఇనుము..
ఇనుముతో చేసిన వంట పాత్రల్లో వంట చేసుకుని తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పాత్రల్లో వండిన వంటకానికి ఐరన్ పోషకాలు కూడా అందుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఐరన్ లోహంతో చేసిన పాత్రలు సరికొత్త డిజైన్లలో అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించండి. శరీరానికి కావాల్సిన ఐరన్ను పొందండి.
కంచు...
కంచు మోత ఎంత ఎక్కువగా వస్తుందో దాంతో ఆరోగ్యానికి ప్రయోజనాలూ అదే స్థాయిలో ఉంటాయి. కంచుతో తయారు చేసిన పాత్రల్లో ఆహారం వండుకుని తినడం ద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. థైరాయిడ్ను బ్యాలెన్స్ చేయడంలోనూ తోడ్పడుతుంది.
ఇత్తడి..
ఇత్తడి పాత్రలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఇతర లోహ పాత్రలతో పోలిస్తే ఈ పాత్రల్లో ఆహారం వండటం ద్వారా కేవలం 7శాతం మాత్రమే పోషకాలను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.
* రాగి..
ఆరోగ్యాన్ని అందించడంలో రాగి మనకు మంచి నేస్తం. రాగి పాత్రల్లోని నీరు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నీటిని శుద్ధి చేసి మినరల్స్ ఉన్న నీటిని అందిస్తుంది. రాత్రి రాగి పాత్రలో ఉంచిన నీటిని ఉదయం లేచిన వెంటనే తాగితే మంచి ప్రయోజనాలుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434