Tamilnadu: పేడతో కొట్టుకుంటేనే వాళ్లకు దీపావళి!
దీపావళి పర్వదినాన్ని సాధారణంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుతూ.. ఆనందంగా జరుపుకొంటారు. కానీ, తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని..
చెన్నై: దీపావళి పర్వదినాన్ని సాధారణంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుతూ.. ఆనందంగా జరుపుకొంటారు. కానీ, తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని వినూత్నంగా చేసుకున్నారు. ఆవు పేడతో కొట్టుకుంటూ పండగ జరుపుకొన్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గుమటపురం గ్రామానికి చెందిన ప్రజలు పండుగ రోజు ఒకే చోట చేరి గోరాయ్ హబ్బా అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆవుపేడను ఒకరిపై ఒకరు విసురుకుంటూ సందడిగా గడిపారు. ఈ పండుగలో గ్రామస్థులు శరీరభాగాలకు పేడను పూసుకుంటూ వేడుక చేసుకుంటారు. పేడను విసురుకునేటప్పుడు కోపాన్ని దరి చేరనీయకుండా ఇతరుల పట్ల స్నేహభావాన్నే కలిగి ఉంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని గుమటపురం గ్రామప్రజలు కొనసాగిస్తున్నారు. 100 ఏళ్ల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
ఆవుపేడను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించి గ్రామంలోని ధీరేశ్వర దేవాలయం వద్ద పోగుచేస్తారు. ఆ ప్రదేశాన్ని రంగు రంగుల కాగితాలతో అలంకరిస్తారు. పండుగ రోజు అక్కడికి గుంపుగా వెళ్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. సంప్రదాయంగా ప్రతి ఏడాదీ ఈ పండగను జరుపుకొంటామని, కుల వివక్షకు తావులేకుండా అందరం కలిసి ఒక చోట ఈ వేడుకను నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు. కలిసి మెలిసి జీవించాలనే సందేశాన్ని ‘గోరాయ్ హబ్బా’ కార్యక్రమం ఇస్తుందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు