Dastagiri: వివేకా హత్య కేసు.. దస్తగిరి పిటిషన్‌ రీఓపెన్‌

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పటిషన్‌ను సీబీఐ రీఓపెన్‌ చేసింది. 

Published : 08 Apr 2024 18:24 IST

హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు రీఓపెన్‌ చేసింది. సీబీఐ వాదనలు వినేందుకు మళ్లీ విచారణ జరపాలని నిర్ణయించింది. గతంలో ఈ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించకపోవడంతో గత నెల 12నే న్యాయస్థానం విచారణ ముగిస్తూ తీర్పును నేటికి వాయిదా వేసింది. కానీ, తాజాగా ఈ నెల 12న విచారణ చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని