Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు

మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో రెండు భారీ భవనాలు కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో దుమ్ము దూళి అలమకుంది. 

Updated : 23 Sep 2023 16:47 IST

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో దుమ్ము దూళి అలముకుంది. రహేజా మైండ్‌ స్పేస్‌లోని 7, 8 బ్లాక్‌లలో నాలుగంతస్తుల భవనాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించేందుకు రెండింటినీ కూల్చివేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రెండు భవనాలను క్షణాల్లో కూల్చి వేశారు. పక్కనే భారీ బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పాత భవనాలను పేక మేడల్లా కూల్చివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని