Viral news: మద్యం మత్తులో ఎద్దుపై సవారీ.. ఆపై ఏం జరిగిందంటే?
మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే, అతడు తన చర్యలతో రోడ్డుపై వెళుతున్న వారికి ఇబ్బందులకు గురిచేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
డెహ్రాడూన్: మద్యం మత్తు తలకెక్కితే చాలా మంది ఏం చేస్తున్నామనే విషయం మర్చిపోయి తమతో పాటు ఇతరులకూ ఇబ్బంది కలిగిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. తాజాగా ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. రిషికేష్(Rishikesh)కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఎద్దు (Bull)పై సవారీ చేస్తూ తపోవన్ ప్రాంతంలో వీధుల్లో హల్చల్ చేశాడు. ఈ ఘటన మొత్తాన్ని రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. యువకుడు అలా ఎద్దుపై స్వారీ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న వారు ఒకింత భయాందోళనకు గురయ్యారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉత్తరాఖండ్ పోలీసులు స్పందించారు. వీడియోను ఉత్తరాఖండ్ పోలీస్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ మే 5న అర్థరాత్రి సమయంలో రిషికేశ్ తపోవన్ ప్రాంతంలో ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తున్న వీడియో మా దృష్టికి వచ్చింది. వీడియో ఆధారంగా యువకుణ్ని అదుపులోకి తీసుకున్నాం. యువత ఎవరు జంతువులను హింసించవద్దని సూచిస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు జంతువులను హింసించడం సరికాదని కామెంట్ చేయగా, మరికొందరు అతను ఎద్దుపై సవారీ బాగా చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు