Hyderabad: మద్యం మత్తులో.. పోలీసులపై మహిళ వీరంగం!
హైదరాబాద్లో అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో ఓ మహిళ.. పోలీసులపై వీరంగం సృష్టించింది.
హైదరాబాద్: హైదరాబాద్లో అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో ఓ మహిళ.. పోలీసులపై వీరంగం సృష్టించింది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన యువతి.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద బంజారా హిల్స్ పోలీసులను దుర్భాషలాడింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ముంబయికి చెందిన మహిళ, మరికొందరు వాహనంలో అటువైపుగా వచ్చారు. కారు నిలిపి బ్రీత్ అనలైజర్తో పరీక్షలు చేస్తున్న పోలీసులను దుర్భాషలాడుతూ.. వారిపై దాడి చేసేందుకు ఆమె యత్నించింది. మహిళతోపాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న ఇతర వాహనదారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఆ మహిళ రెచ్చిపోయింది.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు