1968లో పుట్టా.. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరూ!
లఖ్నవూ: నవజాత శిశువులకు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ మాత్రం 40 ఏళ్లకు పైబడిన వాళ్లు వచ్చి జనన ధ్రువీకరణ పత్రం కావాలంటూ కుప్పులతెప్పులుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లలో అవసరంలేని జనన ధ్రువీకరణ పత్రం ఇప్పుడెందుకా? అని అనుకుంటున్నారా. జాతీయ పౌర పట్టిక కోసం ఈ తిప్పలన్నీ.
లఖ్నవూలో మున్సిపల్ కార్యాలయాలకు క్యూ కట్టిన జనం
లఖ్నవూ: పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ మాత్రం 40 ఏళ్లకు పైబడిన వాళ్లు వచ్చి జనన ధ్రువీకరణ పత్రం కావాలంటూ కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా అవసరంలేని జనన ధ్రువీకరణ పత్రం ఇప్పుడెందుకో అనుకుంటున్నారా? జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన నేపథ్యంలోనే ఇలా జనం బారులు తీరుతున్నారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్), ఎన్ఆర్సీ కారణంగా ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ వాసులు జనన ధ్రువపత్రాల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కారణంగానే పురపాలక కార్యాలయాల ఎదుట భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. జనన ధ్రువపత్రాల కోసం వస్తున్న వారిలో ఎక్కువ మంది 40 నుంచి 50ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. ‘నేను 1968లో పుట్టాను. ఇప్పటి వరకు ఎప్పుడూ నాకు జనన ధ్రువీకరణ పత్రం అవసరం రాలేదు. కానీ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వల్ల నేను నా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తే జనన ధ్రువపత్రం అవసరం ఉంటుందని తీసుకుంటున్నారు’ అని ఆగ్రాకు చెందిన సర్ఫరాజ్ చెప్పుకొచ్చారు. 2018తో పోల్చుకుంటే 2019లో జనన ధ్రువపత్రాలు జారీ మూడు రెట్లు పెరిగినట్లు మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో అప్పుడే పుట్టిన శిశువులకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే వాళ్లు. ఇప్పుడు 50ఏళ్లు పైబడిన వారు ఎక్కువ మంది వస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ‘నా 50ఏళ్లలో ఎన్నడూ జనన ధ్రువీకరణ పత్రంతో అవసరం రాలేదు కానీ సీఏఏ కారణంగా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. దరఖాస్తులు చేసుకుంటున్న వారిలో ముస్లింలే అధికంగా ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం