1968లో పుట్టా.. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరూ!
లఖ్నవూలో మున్సిపల్ కార్యాలయాలకు క్యూ కట్టిన జనం
లఖ్నవూ: పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ మాత్రం 40 ఏళ్లకు పైబడిన వాళ్లు వచ్చి జనన ధ్రువీకరణ పత్రం కావాలంటూ కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా అవసరంలేని జనన ధ్రువీకరణ పత్రం ఇప్పుడెందుకో అనుకుంటున్నారా? జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన నేపథ్యంలోనే ఇలా జనం బారులు తీరుతున్నారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్), ఎన్ఆర్సీ కారణంగా ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ వాసులు జనన ధ్రువపత్రాల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కారణంగానే పురపాలక కార్యాలయాల ఎదుట భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. జనన ధ్రువపత్రాల కోసం వస్తున్న వారిలో ఎక్కువ మంది 40 నుంచి 50ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. ‘నేను 1968లో పుట్టాను. ఇప్పటి వరకు ఎప్పుడూ నాకు జనన ధ్రువీకరణ పత్రం అవసరం రాలేదు. కానీ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వల్ల నేను నా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తే జనన ధ్రువపత్రం అవసరం ఉంటుందని తీసుకుంటున్నారు’ అని ఆగ్రాకు చెందిన సర్ఫరాజ్ చెప్పుకొచ్చారు. 2018తో పోల్చుకుంటే 2019లో జనన ధ్రువపత్రాలు జారీ మూడు రెట్లు పెరిగినట్లు మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో అప్పుడే పుట్టిన శిశువులకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే వాళ్లు. ఇప్పుడు 50ఏళ్లు పైబడిన వారు ఎక్కువ మంది వస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ‘నా 50ఏళ్లలో ఎన్నడూ జనన ధ్రువీకరణ పత్రంతో అవసరం రాలేదు కానీ సీఏఏ కారణంగా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. దరఖాస్తులు చేసుకుంటున్న వారిలో ముస్లింలే అధికంగా ఉంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
-
India News
Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
- Washington Sundar: వాషింగ్టన్ సుందర్కు గాయం.. జింబాబ్వే పర్యటనకు అనుమానమే..!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!