ఒక చేప.. తొమ్మిది పిల్లలు

కూర కోసం సొరచేపను కోయగానే పొట్ట నుంచి 9 పిల్లలు బయటకు వచ్చి ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన ఇది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో

Published : 29 Jan 2020 07:33 IST

కూర కోసం సొరచేపను కోయగానే పొట్ట నుంచి 9 పిల్లలు బయటకు వచ్చి ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన ఇది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఓ మహిళ కూర వండేందుకు సొర చేపను కత్తితో కోశారు. దాని పొట్టలో నుంచి వరుసగా తొమ్మిది పిల్లచేపలు బయటపడ్డాయి. అంత చిన్న చేప కడుపులో అన్ని పిల్లలు ఉండటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై కాకినాడ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి లక్ష్మణ్‌ కుమార్‌ని సంప్రదించగా... ఇతర చేపలు గుడ్లు పెడితే, సొరజాతికి చెందినవి ఒక్కోటీ ఏడు నుంచి పన్నెండు దాకా పిల్లల్ని పెడతాయన్నారు.

- న్యూస్‌టుడే, కొత్తపల్లి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని