మెరుగైన రక్తప్రసరణతో జ్ఞాపకశక్తి పదిలం! 

జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే మెదడుకు రక్త ప్రసరణ బాగుండాలంటున్నారు జర్మనీ శాస్త్రవేత్తలు. స్పొరాడిక్‌ సెరిబ్రల్‌ స్మాల్‌ వెస్సెల్‌ వ్యాధితో

Updated : 16 Feb 2020 23:52 IST

బెర్లిన్‌: జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే మెదడుకు రక్త ప్రసరణ బాగుండాలంటున్నారు జర్మనీ శాస్త్రవేత్తలు. స్పొరాడిక్‌ సెరిబ్రల్‌ స్మాల్‌ వెస్సెల్‌ వ్యాధితో బాధపడుతున్నవారిలో ఈ రక్త ప్రసరణను పెంచడం ద్వారా మేధో సామర్థ్యాలను వృద్ధి చేయొచ్చునని వారు సూచిస్తున్నారు. మానవ మెదడులో హిప్పోకాంపస్‌ అనే చిన్న భాగం ఉంటుంది. మెదడులోని రెండు అర్ధగోళాల్లో 2 హిప్పోకాంపై నిర్మాణాలుగా దాని ఉనికి కనిపిస్తుంది. జ్ఞాపకశక్తి నియంత్రణ కేంద్రంగా హిప్పోకాంపస్‌ను పరిగణిస్తారు. అల్జీమర్స్‌ వంటి వ్యాధుల బారినపడితే ఈ భాగం దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. తాజాగా జర్మనీ పరిశోధకులు 45-89 ఏళ్ల మధ్య వయసున్న 47 మందిపై అధ్యయనం చేపట్టారు. హిప్పోకాంపస్‌ భాగానికి రక్త ప్రసరణ ఎంత మెరుగ్గా ఉంటే.. వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి అంతగా బాగుంటున్నట్లు తేల్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని