ఒక్క రోజుకే పరిమితమైన బహిరంగ వ్యాయామశాల 

పురపాలక మంత్రి కేటీఆర్‌ పాలమూరులో ప్రారంభించిన బహిరంగ వ్యాయామశాల పట్టణ వాసులకు ఒక్క రోజుకే..

Published : 27 Feb 2020 21:44 IST

మహబూబ్‌నగర్‌: పురపాలక మంత్రి కేటీఆర్‌ పాలమూరులో ప్రారంభించిన బహిరంగ వ్యాయామశాల పట్టణ వాసులకు ఒక్క రోజుకే పరిమితమైంది. బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో పురుషుల కోసం ప్రత్యేకంగా ఈ నెల 24న ఈ వ్యాయామశాల ఏర్పాటు చేశారు. ప్రతి పురపాలిక పరిధిలో ఓపెన్‌ జిమ్‌ ఉండాలని, పాలమూరులో ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్‌ కల్వకుర్తిలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పేర్కొన్నారు.  అయితే ప్రస్తుతం పరికరాలు అమర్చిన పునాదులే కనిపిస్తుండటం గమనార్హం. దీనిపై పురపాలక కమిషనర్‌ సురేందర్‌ను వివరణ కోరగా బోల్టులు సరిగా లేవని.. త్వరలో అన్ని పరికరాలు అమర్చుతామని వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని