పట్టణ ఉపాధి హామీ పథకం అవసరం
దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ‘పట్టణ ఉపాధి హామీ పథకం’ అత్యంత అవసరమని ఆర్థికవేత్తలు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. నిరుద్యోగం తగ్గుదల, అర్హతకు తగిన ఉపాధి, ఆదాయ పెరుగుదల.. చిన్న పట్టణాల్లో డిమాండ్ను పెంచుతాయని వారు .....
దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకొని, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ‘పట్టణ ఉపాధి హామీ పథకం’ అత్యంత అవసరమని ఆర్థికవేత్తలు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. నిరుద్యోగం తగ్గుదల, అర్హతకు తగిన ఉపాధి, ఆదాయ పెరుగుదల.. చిన్న పట్టణాల్లో డిమాండ్ను పెంచుతాయని వారు పేర్కొన్నారు. వ్యాపారాలు విజయవంతం అయ్యేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయని సూచించారు.
‘రీ థింకింగ్ ఇండియా సిరీస్’లో భాగంగా వచ్చిన ‘రివైవింగ్ జాబ్స్: యాన్ ఎజెండా ఫర్ గ్రోత్’ తాజా వాల్యూమ్లో సారథి ఆచార్య, విజయ్ మహాజన్, మదన్ పాఠకి వంటి ఆర్థిక, సామాజిక వేత్తలు మహమ్మారి కాలంలో నిరుద్యోగంపై విభిన్న కోణాల్లో స్పృశించారు.
ఉత్పత్తి పెరుగుదల, ప్రభుత్వ సేవలు మెరుగ్గా అందడం చేత నాణ్యమైన జీవితం, ఉద్యోగాల పెరుగుదల, నైపుణ్యాలతో ప్రైవేటు రంగంలో ఉత్పత్తి పెరుగుదల, అసంఘటిత రంగాల్లో ఆదాయవృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకూ ఊతంగా నిలుస్తాయని వారన్నారు. 2012 తర్వాత యువత వేగంగా శ్రామిక విపణిలోకి వచ్చారని కానీ ఉద్యోగాల సృష్టి తగ్గిందని పేర్కొన్నారు. 2020-2030 మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
రానున్న దశాబ్దాల్లో జనాభాను దేశం అత్యుత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలో ‘రివైవింగ్ జాబ్స్’లో నిపుణులు సూచించారు. ఉపయోగించుకోవడంలో విఫలమైతే కోట్లాది మంది పేదరికంలో మగ్గే ప్రమాదం ఉందన్నారు. భారత్లో ఉద్యోగ సంక్షోభం నెలకొందని, ఎక్కువ మంది యువత విపణిలో ప్రవేశించి ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఉపాధి అంతగా దొరకడం లేదని జేఎన్యూ ప్రొఫెసర్ మెహరోత్ర వెల్లడించారు.
‘మొత్తం జనాభాలో పనిచేసే వయస్కులు పెరుగుతున్నారు. దీంతో దేశానికి లాభం కలగాలి. కానీ తక్కువ మంది ఉపాధి కోసం వెతుకున్నారు. అందుకే కార్మిక భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) తగ్గుతోంది. హోదాకు తగిన ఉపాధి దొరక్కపోవడంతో శోధించడం మానేస్తున్నారు. యువత నిరుత్సాహంగా ఉందనేందుకు ఇది సూచన. ఫలితంగా బహిరంగ నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. 2012-18 మధ్య 2.2 నుంచి 6.1 శాతానికి పెరిగింది. 15-29 ఏళ్ల వారిలో ఇది 6.1 నుంచి 17.8 శాతంగా ఉంది’ అని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434