ఇతను మద్యం ఎంత కొన్నాడో తెలుసా?
మూడో దశ లాక్డౌన్లో భాగంగా కంటైన్మెంట్ జోన్ వెలుపలి ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులుదీరారు. బెంగళూరులోని చిక్అడిగోడి ప్రాంతంలోని మద్యం దుకాణంలో ఓ వ్యక్తి ఏకంగా.....
బెంగళూర్ : మూడో దశ లాక్డౌన్లో భాగంగా కంటైన్మెంట్ జోన్ వెలుపలి ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులుదీరారు. బెంగళూరులోని చిక్అడిగోడి ప్రాంతంలోని మద్యం దుకాణంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.52,841 విలువగల మద్యాన్ని ఓకేసారి కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొత్తం 17 రకాల బ్రాండ్లు కొనుగోలు చేసినట్టు చూపిస్తున్న బిల్లు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వాస్తవానికి ఓ వ్యక్తికి 2.25 లీటర్ల వైన్, ఆరు బీర్ బాటిళ్లను విక్రయించేందుకు అనుమతి ఉన్నా.. సదరు వ్యక్తి మాత్రం భారీ మొత్తంలో కొనుగోలు చేశాడు. కర్ణాటకలో సోమవారం ఒక్క రోజే రూ. 45 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు