TS: ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్‌

రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని గిరిజన గురుకులాల

Published : 08 Jun 2020 01:19 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నియామకానికి సంబంధించి పూర్తి వివరాలను www.tgtwgurukulam.telangana.gov.inలో అందుబాటులో ఉంచామని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని