ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దాదాపు 40...

Published : 11 Jun 2020 11:20 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దాదాపు 40 అంశాలపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశముంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు మంత్రివర్గం ఆమోదం తెలపనుందని సమాచారం. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంతోపాటు బిల్డ్‌ ఏపీ పథకం కింద భూముల అమ్మకంపైనా మంత్రివర్గం చర్చించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని