ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మరోసారి కలకలం రేగింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సచివాలయం ఉద్యోగులకు కరోనా...

Updated : 02 Jul 2020 16:27 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మరోసారి కలకలం రేగింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సచివాలయం ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. అసెంబ్లీలో ఇద్దరికి, సచివాలయంలో 10 మందికి, జలవనరులశాఖలో ముగ్గురికి, పశు సంవర్థకశాఖలో ఒకరికి కరోనా నిర్దారణ అయింది. దీంతో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పలువురు ఉద్యోగులు ఇవాళ ఉదయం సచివాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని