కిడ్నాప్‌ కథ సుఖాంతం!

వికారాబాద్‌ పట్టణంలో కలకలం రేపి పోలీసులను 48 గంటల పాటు ఉరుకులు, పరుగులు పెట్టించిన యువతి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతంగా ముగిసింది. భర్తతో కలిసి ఉండాలన్న ఇష్టంతోనే కారులో వెళ్లినట్లు అపహరణకు గురైన ...

Updated : 30 Sep 2020 09:01 IST

భర్తతో కలిసి ఉండటానికే వెళ్లింది


వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నారాయణ

వికారాబాద్‌ : వికారాబాద్‌ పట్టణంలో కలకలం రేపి పోలీసులను 48 గంటల పాటు ఉరుకులు, పరుగులు పెట్టించిన యువతి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతంగా ముగిసింది. భర్తతో కలిసి ఉండాలన్న ఇష్టంతోనే కారులో వెళ్లినట్లు అపహరణకు గురైన దీపిక తెలిపింది. మంగళవారం పోలీసు అధికారి ఎం.నారాయణ తన ఛాంబర్‌లో వారిద్దరినీ విలేకరుల ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.

ఈ నెల 27న సాయంత్రం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా సమీపంలో దీపిక అపహరణకు గురైందన్న సమాచారంతో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె సిద్దిపేటకు వెళ్లిన విషయాన్ని వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ గుర్తించి తీసుకొచ్చారు. నాలుగేళ్ల కిందట ఖలీల్‌ అలియాస్‌ అఖిల్‌, దీపికలు కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దీపిక తల్లిదండ్రులకు ఇష్టంలేక విడాకుల కోసం న్యాయస్థానంలో కేసు దాఖలు చేయించగా కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉండాలన్న అభిప్రాయంతోనే కారులో భర్తతో వెళ్లానని పేర్కొందని పోలీసులు తెలిపారు. న్యాయస్థానంలో దీపిక చెప్పే వివరాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని