Rajdhani Express: రాజధాని ఎక్స్ప్రెస్లో పొగలు.. కావలిలో నిలిచిపోయిన రైలు
చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద బి-5 బోగీలో పొగలు వస్తున్నట్లు గుర్తించి రైలు నిలిపేశారు.
కావలి: చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. బి-5 బోగీ వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. పొగలు వచ్చిన విషయాన్ని తెలుసుకుని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
బ్రేకులు ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరిరావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. రైల్వే సిబ్బంది మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.