YSRCP: పదవిచ్చి పరువు తీసేశారు!
చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించడమే లేదు. ఎంపీడీఓలు, ఎంపీపీలే కాదు.. చివరికి మా పార్టీ నాయకులు కూడా నన్ను మర్చిపోయారు.
చింతపల్లి మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రాజులమ్మ అసహనం
గూడెం కొత్తవీధి, న్యూస్టుడే: చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించడమే లేదు. ఎంపీడీఓలు, ఎంపీపీలే కాదు.. చివరికి మా పార్టీ నాయకులు కూడా నన్ను మర్చిపోయారు. కనీసం విత్తనాల పంపిణీకి కూడా పిలవడం లేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పదవి అంటే ఏంటో అర్థం కాని పరిస్థితికి తీసుకువచ్చారు. ఛైర్పర్సన్ కాకముందే బాగుండేది. పదవిచ్చి పరువు తీసిపడేశారు. నాకు ముందు పనిచేసిన వారికీ ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను.
వైకాపా నాయకుల తీరుపై జైతి రాజులమ్మ ఆవేదన
కొయ్యూరు మండలానికి చెందిన జైతి రాజులమ్మ వైకాపాలో చురుగ్గా వ్యవహరించారు. ఈమె సేవలకు గుర్తింపుగా చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పదవి దక్కింది. వ్యవసాయ పరంగా ప్రాధాన్యమున్న పదవే అయినా ఆ గుర్తింపు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ పరిధిలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో అధికారులు, పాలకులు, నాయకులు కనీసం విత్తనాలు పంచే కార్యక్రమాలకూ పిలవడం లేదంటున్నారు. గూడెంకొత్తవీధిలో సోమవారం జరిగిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి, మంగళవారం జరిగిన సంకాడ గ్రామ సచివాలయం భవనం ప్రారంభోత్సవానికీ తనను ఏ నాయకుడు, అధికారి పిలవలేదని పేర్కొన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసి ఏడు నెలలైనా గూడెంకొత్తవీధి ఎంపీడీఓ ఒక్కసారి కూడా తనను ఏ కార్యక్రమానికీ ఆహ్వానం అందించలేదన్నారు. చింతపల్లి ఎంపీడీఓగా సీతయ్య ఉన్నప్పుడు సమాచారం అందించేవారని తెలిపారు. ఇప్పుడు అక్కడున్న అధికారికి తానెవరో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. పదవి ఇచ్చినా పరువు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM