CoronaVirus: రాజస్థాన్‌లో విషాద సంఘటన

రాజస్థాన్‌లోని 34 ఏళ్ల అవివాహిత మహిళ తన తండ్రి చనిపోయాడనే వార్తను జీర్ణించుకోలేక, తండ్రి చితి మంటల్లోనే దూకి అత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హృదయాన్ని కలిచి వేస్తోంది.

Published : 05 May 2021 20:18 IST

తండ్రి చితి మంటల్లో దూకి కూతురు ఆత్మహత్యాయత్నం

జైపూర్‌: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ దయనీయమైన సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఎంతో మంది తమ వారిని కోల్పోయి కుమిలిపోతున్నారు. కరోనా బాధితుల ఆక్రందనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని 34 ఏళ్ల అవివాహిత మహిళ తన తండ్రి చనిపోయాడనే వార్తను జీర్ణించుకోలేక, తండ్రి చితి మంటల్లోనే దూకి అత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హృదయాన్ని కలిచి వేస్తోంది.
 
వివారల్లోకి వెళ్తే.. బార్మెర్‌లోని రాయ్‌ కాలనీలో నివసించే దామోదర్‌దాస్‌ శర్దా (73)కు ముగ్గురు కుమార్తెలు. అతని భార్య కొంత కాలం కిందట చనిపోయింది. ఇటీవల దామోదర్‌దాస్‌కు కరోనా సోకడంతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వ్యాధితీవ్రత అధికమై మంగళవారం ఆసుపత్రిలోనే చనిపోయారు. కొడుకులు లేనందన కుమార్తెలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు వెళ్లొద్దని వారిస్తున్నా వినపించుకోకుండా దామోదర్‌దాస్‌ చిన్న కుమార్తె చంద్ర శర్దా శ్మశానానికి వెళ్లగా.. తండ్రి చితికి నిప్పు పెట్టగానే చూసి తట్టుకోలేక అకస్మాత్తుగా మంటల్లోకి దూకింది. సమయానికి అక్కడున్నవాళ్లు మంటల్లోంచి ఆమెను బయటకు తీశారు. కానీ, అప్పటికే ఆమె శరీరం 70 శాతం కాలిపోవడంతో చికిత్స కోసం జోధ్పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని