Heritage: కీలక పత్రాల గోప్యతపై అనుమానాలున్నాయి : హెరిటేజ్
హెరిటేజ్కు సంబంధించిన కీలక పత్రాల దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐడీకి ఆ సంస్థ లేఖ రాసింది.
అమరావతి: హెరిటేజ్కు సంబంధించిన కీలక పత్రాల దహనం వీడియోలు చూసి తీవ్ర కలత చెందినట్లు ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐడీకి హెరిటేజ్ లేఖ రాసింది. సీఐడీ అడిగిందని ఐఆర్ఆర్ కేసులో కీలక పత్రాలు ఇచ్చామని, కేసు విచారణలో సహకరించేందుకే ఇలా చేశామని పేర్కొంది. ‘‘న్యాయ ప్రక్రియలో ఇచ్చిన పత్రాల గోప్యత బాధ్యత సీఐడీదే. మా కీలక పత్రాల భద్రత, గోప్యతపై అనేక అనుమానాలున్నాయి. తాజా స్థితిగతులపై వివరణ ఇవ్వాలి. అప్పుడే పత్రాలు సురక్షితంగా, సీఐడీ రక్షణలో ఉన్నాయని నమ్ముతాం. తాజా పరిణామాలపై మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని హెరిటేజ్ లేఖలో పేర్కొంది.
తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. వీటిని తగులబెట్టడాన్ని స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తోంది. సీఐడీ చీఫ్ రఘురామ్రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగులబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. -
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్రెడ్డి.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్