PM Modi: తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ
భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు.
అల్లాదుర్గం: భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. భాజపా ఎన్నికల ప్రచారంలో మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ‘‘ కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుంది. ఆ పంచ సూత్రాలు.. అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని ఆ పార్టీ చూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణలో డబుల్ ‘ఆర్’ ట్యాక్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యాపారులు, గుత్తేదార్లు దొడ్డిదారిలో ఈ ట్యాక్స్ కడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడితే.. డబుల్ ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడుతోంది. పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్తో దిల్లీకి కప్పం కడుతున్నారు. గతంలో భారాస ఎలా అవినీతికి పాల్పడి తెలంగాణను దోచుకుందో.. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది. దీనికి అడ్డుకట్ట పడాలంటే భాజపా అభ్యర్థులను గెలిపించాలి.
పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుంచి 55శాతం ఆస్తి మన పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కుట్రలు పన్నుతోంది. ఇలాంటి భయానక నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారాస దోచుకుందని అప్పుడు ప్రతిపక్షంలోఉన్న కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ భారాసను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అవినీతిలో ఈ రెండు పార్టీలు ఒక్కటే.
రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ రైతులను మోసం చేసింది..
రైతులను భగవత్ స్వరూపులుగా భాజపా చూస్తోంది. తెలంగాణలో 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. వరికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న ఆ పార్టీ హామీ నెరవేరలేదు. పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలని కాంగ్రెస్ చూస్తోంది. హైదరాబాద్లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు. ఓ వర్గం వారి ఓట్ల కోసం మిగతవావారిని ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణను మొన్నటి వరకు భారాస దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది. అయోధ్యలో రామమందిరం 500 ఏళ్ల భారతీయుల స్వప్నం. దిల్లీలో పటిష్ఠమైన ప్రభుత్వం లేక ఇన్నాళ్లూ ఆకల సాకారం కాలేదు. మీ అందరి సహకారంతో, మీరు వేసిన ఓటుతో అయోధ్యలో భవ్యమైన దివ్యమందిరం నిర్మాణం సాధ్యమైంది. మీరు వేసే ఒక్కొక్క ఓటుతో మీ కలలు సాకారం చేస్తాం.
ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం...
ఉమ్మడి ఏపీలో 2004-09లో రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను ఆ పార్టీ ఏవిధంగా కాలరాసిందో కళ్లారా చూశారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్, మరాఠాలకు కాంగ్రెస్ న్యాయం చేయలేదు. 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చింది. ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ. అత్యయిక పరిస్థితి విధించిన చరిత్ర కాంగ్రెస్ది. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. రాజ్యాంగం అంటే విత్ర గ్రంథంగా భావిస్తాం. రాజ్యాంగంపై, అంబేడ్కర్పై కాంగ్రెస్కు గౌరవం లేదు. తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే.. ఇందిరగాంధీ తూట్లు పొడిచారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడింది భాజపా మాత్రమే’’ అని ప్రధాని మోదీ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్