కరోనా: ఆసుపత్రుల్లో మళ్లీ రద్దీ
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి అలజడి రేపుతోంది. సోమవారం ఒక్కరోజే రెండువేల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గుంటూరు, చిత్తూరు, విశాఖ, నెల్లూరు, కృష్ణ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది....
చాపకింద నీరులా విస్తరిస్తోన్న మహమ్మారి
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉద్ధృతి అలజడి రేపుతోంది. సోమవారం ఒక్కరోజే రెండువేల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గుంటూరు, చిత్తూరు, విశాఖ, నెల్లూరు, కృష్ణ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. 70 శాతానికి పైగా కేసులు ఈ ఐదు జిల్లాల నుంచి నమోదు కావడం భయాందోళన కలగజేస్తోంది. అధిక కేసులు బయటపడుతుండటంతో ఆయా జిల్లాల ఆసుపత్రులకు రోగుల తాకిడి అధికమై కరోనా బ్లాక్లను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయవాడలోని జీజీహెచ్లో 150 పడకలు నిండిపోగా రెండో బ్లాక్ను ప్రారంభించారు. గుంటూరులోని జీజీహెచ్లో దాదాపు 800 పడకలు అందుబాటులో ఉండగా 450కిపైగా రోగులు చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జీజీహెచ్లో బెడ్లు నిండిపోయే పరిస్థితి ఏర్పడగా 868 మంచాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ జిల్లాలోని నారాయణ ఆసుపత్రిలో 400 మంది రోగులకు సేవలందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి స్విమ్స్లో 450 పడకలు ఉండగా 221 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్లో 500 వరకు బెడ్లు ఉండగా ఇప్పటికే 250 మంది చేరారు. పడకలు నిండితే విమ్స్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా రెండో దశ విజృంభణలో చాలామంది హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే వీరికి మందులు అందకపోవడంతోపాటు పరిస్థితి తెలుసుకునేందుకు ఆరోగ్య సిబ్బంది సక్రమంగా రావడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కిట్లు అందలేదని, పర్యవేక్షణ కరవైందని బాధితులు వాపోతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కరోనా కేసులు నమోదవుతున్నా.. బహిర్గతం చేయడం లేదు. ఇలాంటి ఘటనలతో తెలియకుండానే వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది.
శుభకార్యాలకు వెళ్లే ప్రతి 200 మందిలో 40 మందికి వైరస్ వ్యాప్తి చెందుతోందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. జిల్లాలో పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే ఈ అంశం బయటపడిందని తెలిపారు. గుంటూరు జిల్లా గుగ్గిరాల మండలం చింతలపూడిలో కొవిడ్తో ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. గ్రామంలో 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు