Corona: వేణ్నీళ్ల స్నానంతో.. కొవిడ్ రాదా?
ఇటీవల వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయం అవుతుందని ప్రచారం జరిగింది. ఈ విషయం మీద భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా చికిత్సకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో సమాచారం కోకొల్లలుగా వస్తోంది. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వేడి నీళ్లు కరోనాను చంపడం లేదా తగ్గించడమనేది నిజం కాదని వెల్లడించింది. ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని తెలిపింది.
వేడినీళ్లు తాగడం, వాటితో స్నానం చేయడం వల్ల కరోనా అంతం అవ్వడం మాట అటుంచితే.. శరీరానికి ఎంతోకొంత ఉపశమనం లభిస్తుందనేది వాస్తవం. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లునొప్పులు తగ్గుతాయి. మొదడు ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా సరిగా అందుతుంది. అలాగే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్లలో ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీటితో పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ సూచించింది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అయితే, వేడి నీటి స్నానం, వేడినీరు తాగడం వల్ల కరోనా రాదన్నది నిజం కాదని చెబుతూనే.. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, అత్యవసరం అయితేనే బయటికి వెళ్లడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. వాటి వల్లే కరోనా రాకుండా చూసుకోవచ్చని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్