Hyderabad Metro: న్యూ ఇయర్‌ వేడుకలు.. మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు.

Published : 30 Dec 2023 16:13 IST

హైదరాబాద్: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరి.. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని