గుండెలో అమర్చే బయో ఎలక్ట్రానిక్ పరికరం
గుండెజబ్బులు ఉన్న వాళ్లు వీలైంనంత త్వరగా వాటిని గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఈ నేపథ్యంలో రబ్బరు ప్రధాన వనరుగా అభివృద్ధి చేసిన బయో ఎలక్ర్టానిక్ పరికరాన్ని అమెరికాకు చెందిన శాస్ర్తవేత్తలు
హృద్రోగ సమస్యల గుర్తింపునకు, చికిత్సకు సాయం
వాషింగ్టన్ : గుండె జబ్బులు ఉన్న వాళ్లు వీలైంనంత త్వరగా వాటిని గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఈ నేపథ్యంలో రబ్బరుతో అభివృద్ధి చేసిన బయో ఎలక్ర్టానిక్ పరికరాన్ని అమెరికాకు చెందిన శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. దీన్ని గుండెలో అమర్చడం ద్వారా గుండె జబ్బుల సమాచారాన్ని బహిర్గతం చేయడంతో పాటు హృదయ కదలికలను పర్యవేక్షిస్తుంది.
అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీర్లు ఆధ్వర్యంలో శాస్ర్తవేత్తలు ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా గుండె జబ్బులను గుర్తించడానికి పేస్మేకర్స్ తయారు చేసే కార్డియాక్ పరికరాలు కఠినంగా ఉంటాయి. కొన్ని మృదువైన పరికరాలు సైతం గుండెకు సంబంధించి కొంత వరకే సమాచారాన్నే సేకరించగలవు. ఈ నేపథ్యంలో బయో ఎలక్ర్టానిక్ పరికరం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరికరాన్ని గుండెలో అమర్చితే ఒకే సమయంలో హృదయం పనితీరు, ఉష్ణోగ్రత, స్పందనలతో పాటు గుండె సంబంధిత వ్యవస్థ గురించి తెలుపుతుంది.
తొలిసారి గుండె కణజాలానికి అనువుగా ఉండే రబ్బరు ఆధారిత బయో ఎలక్ర్టానిక్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు పరిశోధనలో భాగమైన టెక్సాస్లోని సూపర్ కండెక్టివిటీ సెంటర్ ప్రధాన పరిశోధకుడు కున్జియాంగ్ యు, హ్యూస్టన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డి.కుక్ తెలిపారు. ఈ పరికరం వల్ల కఠినమైన ఎలక్ర్టానిక్ పదార్థాలతో రూపొందిన కార్డియాక్ పరికరాల వినియోగాన్ని భర్తీ చేయొచ్చు. ఇది పనిచేయడానికి బయటి నుంచి ఎటువంటి శక్తీ అందించాల్సిన అవసరం లేదు. గుండె కొట్టుకోవడం ద్వారా శక్తిని పొంది పని చేసే గొప్ప లక్షణం దీనికి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం