IPS Anand Mishra: ‘అస్సాం సింగం’ ఆనంద్ మిశ్రా రాజీనామా
అస్సాంకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి, మణిపుర్ అల్లర్లపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్లో భాగమైన ఐపీఎస్ ఆనంద్ మిశ్రా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
గువాహటి: అస్సాం(Assam) కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి, మణిపుర్ అల్లర్లపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్లో భాగమైన ఐపీఎస్ ఆనంద్ మిశ్రా (IPS Anand Mishra).. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీవితాన్ని స్వేచ్ఛగా కొనసాగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అస్సాం-మేఘాలయ కేడర్కు చెందిన ఆనంద్ మిశ్రా.. సోషల్మీడియాలో చాలా పాపులర్. అస్సాంలో మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా, దోపిడీలను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో అక్కడి ప్రజలు ఆయన్ను ‘అస్సాం సింగం’గా పిలవడం మొదలుపెట్టారు. రాష్ట్రంలోని లఖింపూర్ జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన్ను మణిపుర్ అల్లర్లపై దర్యాప్తు కోసం బదిలీ చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఐపీఎస్కు మించి సామాజిక సేవలు చేయడం ద్వారా స్వేచ్ఛాయుత జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నా. అందుకే, బేషరతుగా ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని ఆనంద్ మిశ్రా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా.. మిశ్రా త్వరలో భాజపాలో చేరుతారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం బిహార్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
కౌంటింగ్ సిబ్బందికి మే 26 నాటికే శిక్షణ పూర్తయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ తెలిపారు. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకావడం లేదని సమాచారం. -
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో రాజ్భవన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. -
సార్వత్రిక సమరం.. తుది విడత పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. -
నేడు హనుమాన్ జయంతి.. కాషాయమయంగా కొండగట్టు
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామనామజపంతో కాషాయమయమైంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
దీనస్థితిలో తల్లి ఏనుగు.. కాపాడిన అటవీ అధికారులు!
Viral video: వన్యప్రాణులకు సంబంధించిన మరో వీడియోను పంచుకున్నారు ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం