CM Jagan: సీఎం జగన్‌తో అవినాష్‌రెడ్డి భేటీ

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. 

Published : 27 Jul 2023 15:35 IST

తాడేపల్లి: కడప వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు అవినాష్‌ను విచారించిన సీబీఐ అధికారులు ఇటీవల సీబీఐ కోర్టులో ఛార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు.ఈ  నేపథ్యంలో అవినాష్‌రెడ్డి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని