Corona మృతదేహాన్ని పీక్కుతిన్నాడు!

అయితే ఓ వ్యక్తి ఏకంగా కరోనా మృతదేహాన్ని పీక్కుతిన్న ఘటన సంచలనంగా మారింది. ఒళ్లు గగ్గురుపొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ శ్మశానవాటికలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది....

Updated : 04 May 2021 13:34 IST

ముంబయి: కొవిడ్​ సోకి మృతిచెందితే ఆ మృతదేహం వద్దకు వెళ్లేందుకే ఎవరూ సాహసించడంలేదు. మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకురావద్దని, ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించొద్దని కొందరు గ్రామ పెద్దలు ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా కరోనా మృతదేహాన్ని పీక్కుతిన్న ఘటన సంచలనంగా మారింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ శ్మశానవాటికలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

సతారా జిల్లాలోని ఫల్టాన్​ మున్సిపల్​ పరిధిలోని ఓ శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ వ్యక్తి పీక్కు తింటున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫల్టాన్​ మున్సిపల్​ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే వారు వచ్చేలోగా సదరు వ్యక్తి పరారయ్యాడు. కాగా సాయంత్రానికల్లా అధికారులు అతడిని వెతికి పట్టుకోగలిగారు. అయితే సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని అధికారులు గుర్తించారు. మానసిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించినట్లు పేర్కొన్నారు.  వైద్య నివేదికలు వచ్చిన అనంతరం దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని