AP News: భవిష్యత్‌లో ఎంత నష్టమో ఉద్యోగులు గమనించాలి: అశోక్‌బాబు

23శాతం ఫిట్‌మెంట్‌తో సీఎం జగన్‌ ఉద్యోగులను వంచించారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన

Updated : 08 Jan 2022 12:42 IST

అమరావతి: 23శాతం ఫిట్‌మెంట్‌తో సీఎం జగన్‌ ఉద్యోగులను వంచించారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి జూన్‌ దాకా సమయం కావాలా? అని ప్రశ్నించారు. ప్రస్తుత పీఆర్సీతో పదవీవిరణ చేసే ఉద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు. ఈ పీఆర్సీలకు ఉద్యోగులకు రూపాయి కూడా బెనిఫిట్‌ లేదన్నారు. ‘‘ హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. నష్టాన్ని తగ్గించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాలి. ఇక నుంచి సెంట్రల్‌ పీఆర్‌సీ ఇస్తామని సీఎం చెబుతున్నారు. రాష్ట్ర పీఆర్‌సీ వేరు.. సెంట్రల్‌ పీఆర్‌సీ వేరని ఉద్యోగులు గుర్తించాలి. భవిష్యత్‌లో ఎంత నష్టం జరుగుతుందో ఉద్యోగులు గమనించాలి’’ అని అశోక్‌ బాబు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని